- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయంతో బోణి కొట్టిన కోల్కతా జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో మ్యాచ్ని చేజార్చుకున్న కోల్కతా.. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ అదే రీతిలో పరాజయాన్ని చవిచూసింది.
మరోవైపు ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు టోర్నీ ఆరంభంలో పంజాబ్, రాజస్థాన్తో ఆడిన మ్యాచ్ల్లో ఓడినా.. ఇటీవల ముంబయి ఇండియన్స్పై గెలిచి ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. సుదీర్ఘకాలం కెప్టెన్గా కోల్కతా జట్టుని నడిపించిన గౌతమ్ గంభీర్.. ఢిల్లీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి.. కోల్కతాని ఢీకొంటున్నాడు.