- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్కు చివరి లీగ్ మ్యాచ్లో ఆడిన టీమ్తోనే సన్రైజర్స్ బరిలోకి దిగుతున్నది. అటు చెన్నై టీమ్లో మాత్రం ఒక మార్పు చేశారు. సామ్ బిల్లింగ్స స్థానంలో షేన్ వాట్సన్ మరోసారి టీమ్లోకి వచ్చాడు.
ఇప్పటికే సీజన్లో ఈ రెండు జట్లూ రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి వెళ్లనుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెండు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.