- Advertisement -
మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్లో ఈ పేరు సంచలనమే అని చెప్పాలి. జట్టు ఓడిపోయిన,గెలిచిన తన స్పందన ఒకే విధాంగా ఉంటుంది.అందుకే అతనిని కూల్ కెప్టెన్ అని అంటారు.తాజాగా ధోని వ్యక్తిత్వం గురించి మరో సంఘటన ఒకటి బయట పడింది.2008లో ముక్కోణపు సిరీస్లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాను ఓడించినపుడు అతిగా స్పందించవద్దని సహచరులందరికీ సంకేతాలిచ్చాడట ధోని.
ఛేదన పూర్తయ్యాక డగౌట్లో ఉన్న వాళ్లు ఎగిరి గంతులేయొద్దని చెప్పాడట. అలాగే తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు సైతం మ్యాచ్ పూర్తయ్యాక మామూలుగానే ఉండమని, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసంతో కరచాలనం చేయమని సూచించాడట.వారి దేశంలో ఆసీస్ను రెచ్చగొట్టడం అంత మంచిది కాదనే ఉద్దేశంతో కూడా ధోని సెలబ్రేషన్స్ దూరం పెట్టి ఉండవచ్చన్నాడు.