Friday, May 3, 2024
- Advertisement -

బీసీసీఐకి కాసుల పంట‌…

- Advertisement -

బీసీసీఐకి కాసుల పంట పండింది. వచ్చే ఐదేళ్లపాటు టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల ప్రసార హక్కులను స్టార్ ఇండియా తిరిగి దక్కించుకుంది. సోనీ, రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ ఎదురైనా.. భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ.. స్టార్ ఇండియా బీసీసీఐ మీడియా హక్కులను కొనుగోలు చేసింది.

2018-23 మధ్య భారత క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి స్టార్ ఇండియా బీసీసీఐకి రూ.6138.1 కోట్లు చెల్లించనుంది. అంటే సగటున ఒక్కో మ్యాచ్‌కి మీడియా రైట్స్ రూపంలోనే బీసీసీఐకి రూ. 60 కోట్లు లభించనున్నాయి. 2012-2018 కాలానికి రూ.3851 కోట్లుగా ఉన్న దీని విలువ ఇప్పుడు ఏకంగా 59 శాతం పెరగడం విశేషం. ఏప్రిల్ 15 నుంచి 2023 మార్చి 31 వరకు స్టార్ ఇండియా టీమిండియా ఆడే మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది.

ఈ ఐదేళ్ల కాలంలో భారత్ అన్ని ఫార్మాట్లు కలుపుకొని 102 మ్యాచ్‌లు ఆడనుందది. గత ఏడాది సెప్టెంబర్లో ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2018-22 మధ్య కాలానికి స్టార్ ఇండియా ఏకంగా రూ.16,347.5 కోట్ల బిడ్ దాఖలు చేసింది. 2012లో భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం స్టార్ ఇండియా రూ.3851 కోట్లకు బిడ్ వేయగా.. సోనీ రూ. 3700 కోట్లు బిడ్ వేసి కొద్ది తేడాలో ప్రసార హక్కులను కోల్పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -