- Advertisement -
టీమిండియా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఆల్ టైమ్ బెస్ట్ రికార్డును నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన అఖిరి వన్డేలో విజయం సాధించి ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డేలతో ఆల్ టైమ్ రికార్డును సాధించింది. ఈ సంవత్సరంలో టీమిండియా 29 వన్డేలకు గాను 21 మ్యాచ్ల్లో విజయంగా సాధించగా, 7 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. మరొక మ్యాచ్లో ఫలితం రాలేదు.
ఈ ఏడాది టీమిండియా గెలుపు-పరాజయాల రేషియో 3.000గా నమోదైంది. ఇది వన్డే ఫార్మాట్లో భారత్కు ఆల్ టైమ్ రికార్డు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ లేకపోయినప్పటీకి రోహిత్ నాయకత్వంలో టీంఇండీయా మూడు వన్డేల సిరీస్ను 2-1తో గెలుచుకుంది.