తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి. రాజకీయాలకు చెరగతి చిరునామా ఆయన. ఎక్కడికి వెల్లినా ఏసభలకు వెల్లినా జననీరాజనాలు అందుకున్న మాహా నేత. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టాడు.
అన్నదాతల రుణాలను మాపీ చేసి ఉచిత కరెంటు ఇచ్చి రైతులను ఆదుకున్న నేత.ఆయన చిరునవ్వే ఒక ఆయుధం. మంచితనం ఆయన నైజం.చిన్న పెద్దాతేడాలేకుండా ప్రతీఒక్కరినీ కలుపుకొని వెల్లే నేత. రాజశేఖర్రెడ్డి గారితో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని …. అయన గొపతనాన్ని ఓ మిత్రుడి మాటల్లో విందా…..
1992 లో నల్గొండజిల్లా సాంఘిసంక్షేమ శాఖకు సంబంధించిన గ్రూప్ 1 అధికారి కడపజిల్లా బలిజ సామాజిక వర్గానికి చెంది అధికారి. హస్టల్లో జరుగుతున్న అవినీతి కారణంగా 20 మంది వార్డెన్లను సస్సెండ్ చేశారు. మళ్లీ తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని లంచం ఆశ చూపించినా లొంగలేదు. సస్సెండ్ వారెడ్డన్ లందరూ అప్పటి కాంగ్రస్ ఎంపీ చిక్కలం శ్రీనివాసరావును కలిసి జరగినదంతా చెప్పగా ఆయన వందమంది అనుచరులతో ఆర్థారత్రి అధికారి ఇంటికివెల్లి బెదిరించాడు. అక్కడే ఉన్న ఆయన సోదరుడు (నామిత్రుడు) ఏమి చేయలని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే హైదరాబాద్కు బయటు దేరి చేరుకొని రాజశేఖర్రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్నతన స్నేహితులు మాకం అశోక్బాబు, మధుసుదన్రెడ్డిలను వెంటబెట్టుకొని నేరుగా రాజశేఖర్రెడ్డి ఇంటికి చేరుకున్నాం..
కన్నీళ్లతో ఉన్న అధికారి సోదరుడిని చూసి ఏరా ఏమైందంటూ జరిగిన దంతా వివిరంగా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఏంజరిగిందో చెప్పెముందు అప్పటి రాజకీయాల గురించి ఒక్క మాట చూసుకుంటే ఎన్టీఆర్ తెలుగు దేశం స్తాపించిన సమయంలో ఎస్.సీ, ఎస్.టీ, మైనారిటీలు కాంగ్రెస్ కు ఓటుబ్యాంక్గా ఉండేవాల్లు. బలిజ సమాజిక వర్గం దాదాపు అంతా టీడీపీకీ ఓటు బ్యాంకుగా ఉడేవారు..క మ్మసాజిక వర్గం టీడీపీకీ ఎంత నమ్మకంగా ఉండేదో… బలిజ సామాజిక వర్గం కూడా అంతే నమ్మకంగా ఉండేది….. జరిగినదంతా తెలుసుకొని వెంటనే చిక్కలం శ్రీనివాస్రావుకు పోన్ చేసిన వెంటనే ఇంటికి వచ్చారు. ఏం సర్దార్ జీ బెదరించినావంట ఏంటి సంగతి ఇష్టంలేకపోతే అధికారిని ట్రాన్స్పర్ చేయించుకోవచ్చు కదా మీప్రభుత్వమే కదా ఉండేదన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పటికీ కాంగ్రెస్ అసమ్మతి నాయకుడిగా ఆ మాటన్నారాయన.
నిజాయితీ గల ఆఫీసర్ ఆయనను బెదిరించడమేంటయ్యా కాసింత జ్ణానముండాలి అంటానే వెంటనే అదికారికి పోన్ చేసి సారి చెప్పాడు.. దీన్ని బట్టే చూసుకోవచ్చు రాజశేఖర్రెడ్డి మంచితనం. ఒక ఎంపీ స్థాయి అధికారిని అధష్టానాన్ని లేక్కచేయకుండా మాట్లాడటం ఒక ఎత్తైతే… ఓటమిని కోరుకొనే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తనీ చూసుకోకుండా సహాయం చేసిన మహానుబావుడు. తనను వ్యతిరేకించే వారుకూడా అపద సమయంలో తలుపుతడితే అపన్నహస్తం అందించే గుణం ఒక్క రాజశేఖర్రెడ్డికే ఉంటుందనేదానికి ఇది నిదర్శనం. ఇటువంటి మంచి మనసే రాష్ట్రంలో ఒక మహోన్నత వ్యక్తిగా నిలబెట్టింది. అతని కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే మనసులను సంపాదించి పెట్టింది. ఇది చదివితే శత్రువైనా ఆయన అభిమాని కావాల్సిందే.
Related