Thursday, May 16, 2024
- Advertisement -

షాకింగ్ : పుష్కరాల్లో చంద్రబాబు కి పిండ ప్రధానం

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే తెలుగు దేశం కార్యకర్తలకి చాలా ఇష్టం. వారి అభిమానం ఎంతగా ఉంటుందో చాలాసార్లు చూసాం. మరీ మూర్ఖంగా కూడా ఆయన అభిమానులు ప్రవర్తించిన సందర్భాలు లేకపోలేదు అయితే కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం దగ్గర చంద్రబాబు అభిమానులు చేసిన పని అందరికీ వింతగా అనిపిస్తోంది.

తెలుగు తమ్ముళ్లు ఏకంగా అక్కడ చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ఆ బొమ్మ ఎదురుగా కూర్చుని పిండ ప్రదానాలు చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా పిండ ప్రదానాల వద్ద మరణించిన వారి చిత్రాలు ఉంచుతారు. కానీ.. ఇలా ఒక ముఖ్యమంత్రి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి అక్కడ పిండ ప్రదానాలు చేయడం కరెక్టు కాదని పలువురు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

అపరకర్మల గురించి తెలిసినవారైతే ఇది చాలా తప్పని హెచ్చరిస్తున్నా వినేవారే కరవవుతున్నారు. వందలాది మంది చంద్రబాబు సైకత శిల్పాన్ని ఎదురుగా పెట్టుకుని పిండప్రదానాలు చేసేస్తున్నారు. దీంతో చంద్రబాబు కే పిండం పెట్టేస్తున్నారు అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -