నల్లవం అనే మలయాళం సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైనది మలయాళం కుట్టి ఎస్తర్ అనిల్. దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వం వహించిన “దృశ్యం” అనే చిత్రంలో వెంకటేష్ కూతురు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిచింది. ఈ చిత్రంలో నటించిన అనంతరం మలయాళం, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి పెద్దగా గుర్తింపు రాలేదు.
దీంతో కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత ఇటీవలే మలయాళంలో జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిచింది. అలాగే తెలుగులో దర్శకుడు తేజ మామి దర్శకత్వం వహించినటువంటి జోహార్ అనే చిత్రంలో కూడా చేసింది. ఇన్ని సినిమాలు చేసిన ఈమెకు మళ్లీ పెద్ద ఆఫర్స్ రాలేదు.
దీంతో తాజాగా ఎస్తర్ అనిల్ నటన పరంగా మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ హీరోయిన్ అవకాశాలను దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. ఇందులో భాగంగా పలు రకాల ఫోటో సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ కుర్రకారు మతి పోగొడుతోంది. తాజా సమాచారం ప్రకారం మలయాళంలోని ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
నటి రోహిణి తమ్ముడు టాలీవుడ్ లో పెద్ద విలన్ అని తెలుసా ?
బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో చెప్పేసిన గంగవ్వ..!
ఎక్కువగా సిగరెట్లు తాగే మహేష్ సడెన్ గా ఎందుకు మానేశాడో తెలుసా ?