శ్రీలంక మాజీ పేస్ బౌలర్ చమిందా వాస్ గత మూడు రోజుల క్రితం టీమ్ కి కోచ్గా నియమితుడైయ్యారు.కాని అది మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. శ్రీలంక క్రికెట్ బోర్డుతో డబ్బు విషయంలో డీల్ కుదరకపోవడంతో తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా శ్రీలంక టీమ్ వెస్టిండీస్ టూర్కు బయలుదేరే ముందే వాస్ రాజీనామా చేయడంపై లంక బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇలాంటి సమయంలో దేశానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన సమయంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అది కూడా టీమ్ బయలుదేరే ముందే రాజీనామా చేయడం ఏంటని లంక బోర్డు అధికారి ప్రశ్నించారు.
కాగా, ఇప్పటి వరకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టూర్లలో టీమ్ ప్రదర్శన మరీ దారుణంగా ఉంటంతో అప్పటి వరకూ బౌలింగ్ కోచ్గా ఉన్న డేవిడ్ సకర్ను తొలగించి గత వారమే ఆ బాధ్యతలు వాస్కు అప్పగించింది లంక బోర్డు. ఆదుకుంటారనుకున్న వాస్ రాజీనామా చేయడంపై లంక బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది.