గత ఏడేళ్లుగా తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్ధస్త్ తో పరిచయం అయిన ఎంతో మంది కళాకారులు ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. జబర్ధస్త్ అనగానే హైపర్ ఆది స్కిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. హైపర్ ఆది,రైజింగ్ రాజు చేసే కామెడి అంతా ఇంతా కాదు. ఈ రోజు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా యాక్సిడెంట్స్ జరుగకుండా ఉండే నివారణ చర్యల గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ చేతుల మీదుగా కొందరికి సన్మానం జరిగింది.ఇందులో జబర్ధస్త్ హైపర్ ఆది టీమ్ కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ హైపర్ ఆదిని శాలువాతో సన్మానించారు. తర్వాత స్టేజీపైకి రైజింగ్ రాజు వచ్చాడు.. వచ్చీ రాగానే జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడు.
అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో షాక్ అయ్యాడు తారక్. తన కంటే వయసులో పెద్ద వాడైన రాజు వచ్చి తన కాళ్లపై పడటంతో వారించాడు యంగ్ టైగర్. మీరేంటి ఇలా చేస్తున్నారు.. అలా చేయకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత శాలువాతో సన్మానించి ఆప్యాయంగా మాట్లాడారు.