తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది యాంకర్ అనసూయ. అప్పటి వరకు ఏ లేడీ యాంకర్లకు రాని ఇమేజ్ ఈ అమ్మడికి వచ్చింది. బుల్లితెరపై తన సత్తా చాటుతూనే వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త గా తెగ పాపులారిటీ సంపాదించింది.
ఆ తర్వాత వరుసగా వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటుంది. బుల్లితెర, వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుంది అనసూయ. అప్పుడప్పుడు ఇతర దేశాలకు వెళ్తూ భర్త.. ఇద్దరు పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న అనసూయ ఎలాంటి సందర్భం వచ్చినా దానికి తగ్గరీతిలో స్పందిస్తుంది.
తాజాగా అనసూయ వర్షంలో తన పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తూ.. కొడుకు చేసిన పేపర్ బోట్ ను వర్షంలో వదిలిపెట్టి.. తానూ చిన్నపిల్లలా సంబరపడిపోయింది. ఆమె పెంచుకుంటోన్న రామచిలుకకి ముద్దు పెట్టడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. తన పిల్లలతో పడవను వదులుతూన్న ఈ వీడియో అభిమానుల్ని ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీ’ లాంటి సినిమాల్లో నటిస్తుంది.