తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్కు ఉన్న ఇమేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. ఇతడు నటించిన సినిమాలు తెలుగు లోనూ డబ్ అయి మంచి వసూళ్లే రాబట్టాయి. గత ఏడాది విడుదలై మాస్టర్ చిత్రం తెలుగులో రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. బాక్సాఫీసు దగ్గర దాదాపు 15 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం విజయ్ కు తెలుగు లోనూ మంచి మార్కెట్ ఉంది.
ఇక వరుస సక్సెస్ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్.. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాకు సిద్ధమవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఈ సినిమా చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా ఏక కాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ అంశం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ద్విభాషా చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు దిల్ రాజు. ఈ చిత్రానికి విజయ్ దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రెమ్యూరేషన్ తో పాటు లాభాల్లోనూ కొంత వాటా తీసుకోనున్నట్లు సమాచారం. కేవలం హీరోకే ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తే.. సినిమా ఖర్చు ఎంత అవుతుందో అని చాలా మంది లేక్కలేసుకుంటున్నారు. సౌత్ లో విజయ్ కు ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం డబుల్ కలెక్షన్లను సాధిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే శాటిలైట్ హక్కుల కోసం జీ స్టూడియోస్ దాదాపు 200 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే విడుదలయ్యాక ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి.. దీపావళికి సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రస్తుతం విజయ్ బీస్ట్’ చిత్రం పనుల్లో బిజాగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బీస్ట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దాదాపు ఈ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
Also Read : మరో సీక్వెల్ కు సిద్ధమవుతున్న డార్లింగ్