బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్తో రిలేషన్ షిప్పై హీరోయిన్ అలియా భట్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ సెలబ్రిటీ లవ్ బర్డ్స్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. చిన్ననాటి నుంచే వీరిద్దరు మంచి స్నేహితులు. అయితే బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలో ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురు పెళ్లి చేసుకుంటారంటూ రెండేళ్ల నుంచి వరుస కథనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అలియాభట్… రణబీర్ తో పెళ్లిపై అసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు గంగూబాయ్ కతియావాడీ సినిమా ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉంది. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలపై స్పందించింది. ఈ సందర్భంగా గతంలో రణబీర్ చేసిన వ్యాఖ్యలను విలేఖరి ప్రస్తావించాడు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రణ్బీర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. లాక్డౌన్ లేకపోతే ఈపాటికి అయిపోయి ఉండేదని అన్నారు.
నిజమేనా?’’ అని విలేఖరి ప్రశ్నించగా.. ‘‘నా దృష్టిలో మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది అని అలియా భట్ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం తన మైండ్ లో ఆయనే తన భర్త అని చెప్పుకొచ్చింది. లాక్డౌన్ కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది. కానీ, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది’’ అని అలియా భట్ తెలిపింది.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు