ఈ ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో చాలా వస్తువులపై ట్యాక్స్ పెంచడం… కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గించి 2.5 శాతం చేసిన విషయం తెలిసిందే.. మరి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి. వేటి ధరలు తగ్గనున్నాయో ఒకసారి చూద్దాం.
ధరలు పెరిగేవి : ప్లాస్టిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు లేదా ఆభరణాలు, ప్లాటినం నగల ధరలు పెరుగుతాయి. వీటితో పాటు ఇమిటేషన్ నగలు, ఎలక్ట్రిక్, కిచెన్ చిమ్నీలు, సిగరెట్లు, ప్రైవేటు జెట్లు, హెలికాప్టర్లు దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.
ధరలు తగ్గేవి: వజ్రాలు, రంగురాళ్లు, టీవీలు, సైకిళ్ళు, ఇంగువ, కాఫీ గింజలు, మొబైల్ ఫోన్లు, మొబైల్ చార్జర్లు, దుస్తులు, బొమ్మలు, కెమెరాలు లెన్స్ లు మన దేశంలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు అదేవిధంగా పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీలు ఇందులో ఉన్నాయి.