Wednesday, May 15, 2024
- Advertisement -

సర్వనాశనం చేశావ్..చిన్నమ్మపై విజయసాయి!

- Advertisement -

సొంత పార్టీ నేతల నుండే కాదు అధికార వైసీపీ నుండి వస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చిన్నమ్మ, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. వైసీపీ ప్రభుత్వంపై పురందేశ్వరి చేసిన విమర్శలపై తమదైన శైలీలో విరుచుకపడుతున్నారు. ప్రధానంగా ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక చేస్తున్న కామెంట్స్‌ ఖచ్చితంగా ఆమెకు చికాకు తెప్పించడం ఖాయం.

2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే అక్కడి ప్రజలు 36 శాతం ఓట్లతో గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యి…రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశావేమ్మా.. అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు కేవలం 2.73% అంటే 33,892 ఓట్లు. మొత్తం 12 లక్షల 50 వేల ఓట్లలో 33 వేల ఓట్లంటే కనీసం మన సామాజికవర్గం వాళ్ళు కూడా వేయనట్టే కదా..? అంటూ పర్సనల్‌గా టారెగ్ట్ చేశారు. క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా.. ఒకసారి మీకు గుర్తు చేయమని ఒక విశాఖ మిత్రుడు పంపాడు అంటూ చురకలు అంటించారు.

ఇక నిన్న ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరావు కలిసే చంద్రబాబుకు కత్తి అందించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రోజా అయితే ఒకడుగు ముందుకేసి తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలపై చిన్నమ్మ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -