Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ సంచలనం..11 స్థానాలకు కొత్త ఇంఛార్జీలు!

- Advertisement -

ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమించారు జగన్. రెండోసారి అధికారం, గెలుపే లక్ష్యంగా ఇంఛార్జీల నియామకం జరిగింది.

ఈ సందర్భంగా మీడియాకు వివరాలను వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. గుంటూరు పశ్చిమకు విడుదల రజనీ,మంగళగిరి నుండి గంజి చిరంజీవి, పత్తిపాడు నుండి బాలసాని కిషోర్,వేమూరు నుండి అశోక్ బాబు,సంతనూతల పాడు నుండి మేరుగ నాగార్జున, తాడికొండ నుండి మేకతోటి సుచరిత, కొండెపి నుండి ఆదిమూలపు సురేష్,చిలకలూరిపేట నుండి రాజేష్ నాయుడు,అద్దంకి నుండి పాణెం హనిమి రెడ్డిని నియమించారు.

నేతల గెలుపు అవకాశాలను భట్టి ఇంఛార్జీలను మార్చామని తెలిపారు సజ్జల.అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ బరిలో దిగనుందని …భవిష్యత్‌లో అవసరాన్ని భట్టి మార్పులు ఉంటాయిన తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -