- Advertisement -
సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకం రేపాయి. ఈ మేరకు చెన్నై డీజీపీ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈమెయిల్ వచ్చింది.
అందులో చెన్నై పోయస్ గార్డెన్లో రజినీ, ధనుష్ ఇళ్లకు.. కల్పాక్కంలో ఉన్న టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుతంగై ఇళ్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేయగా అనంతరం అది ఫేక్ ఈమెయిల్గా నిర్ధారించారు అధికారులు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
