రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ…DDCA డైరెక్టర్ శ్యామ్ సుందర్ శర్మ అతనికి మద్దతుగా నిలిచారు. కోహ్లీని క్రికెట్ ప్రపంచపు “అన్ క్రౌన్డ్ కింగ్” (Betaaj Badshah) గా ఆయన అభివర్ణించారు.
అలుపెరగని బాద్షా: కోహ్లీ కెరీర్ ముగిసిపోయిందని విమర్శించే వారికి సమాధానమిస్తూ…విరాట్ ఇంకా కనీసం ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడతాడు. అతను ఒక బిందాస్ బాద్షా…. అతని స్థాయికి సరితూగే ఆటగాడు ప్రస్తుతానికి ఎవరూ లేరు అని శర్మ పేర్కొన్నారు.
కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణమైనదని, ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మరియు RCB మధ్య జరిగిన మ్యాచ్ టిక్కెట్ల కోసం వచ్చిన ఒత్తిడి తన 40 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లోనే కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. తన సొంత మైదానంలోనే ఈ ఘనత సాధించడం విశేషం.
ఢిల్లీ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ఆ జట్టు ఫామ్లో లేకపోవడమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావడం లేదని, గెలవడానికి వారు ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మరియు ఫామ్ చూస్తుంటే అతను మరికొన్ని ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్ను శాసిస్తాడని శ్యామ్ సుందర్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లీని విమర్శించే వారికి అతని రికార్డులే సమాధానం చెబుతాయని ఆయన స్పష్టం చేశారు.
