- Advertisement -

విమర్శలు లేకపోతే మజా ఉండదు..రోహిత్ కౌంటర్

- Advertisement -

తన ఫామ్‌పై వస్తున్న విమర్శలను తాను ఏమాత్రం పట్టించుకోనని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో తన రిటైర్మెంట్ రూమర్స్‌కు చెక్ పెట్టిన రోహిత్…విమర్శలు తన ఆటకు ఎప్పుడూ ఆటంకం కలిగించలేదని తేల్చి చెప్పారు.

అన్ని ఫార్మాట్లలోనూ వరుసగా తక్కువ స్కోర్లకే పరిమితమవ్వడం..అంతర్జాతీయ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు రావడంతో ఈ భారత మాజీ కెప్టెన్ తీవ్ర ఒత్తిడి మధ్య ఈ మ్యాచ్‌లోకి అడుగుపెట్టారు. లార్డ్స్ వన్డేకు ముందు అతను ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 30.12 సగటు మరియు 88.60 స్ట్రైక్ రేట్‌తో కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ సహాయంతో 241 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

బయటి అభిప్రాయాలపై దృష్టి పెట్టడం కంటే జట్టు విజయానికి సహకరించడానికే తాను ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.నా పని బ్యాట్‌తో రాణించడం, మైదానంలోకి వచ్చి ఆడటం, నా దేశానికి మరియు జట్టుకు ప్రాతినిధ్యం వహించడం. నా అరంగేట్రం నుండి నన్ను చేయమని చెప్పిన పని అదే…..నేను చేయబోయేది కూడా అదే. నేను క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుండి ఈ విమర్శల హోరు ఉంది. నేను ఇక్కడ ఉన్నంత కాలం అది ఉంటూనే ఉంటుంది. కాబట్టి అది పెద్దగా విషయమే కాదు. నేను మైదానంలో ఏం చేస్తున్నాననేదే ముఖ్యం. జట్టు విజయానికి నా వంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు.

ప్రస్తుతం నా దృష్టి అంతా దానిపైనే ఉంది. విమర్శలను రానివ్వండి. విమర్శల శబ్దం లేకపోతే అసలు మజాయే ఉండదు! నా పని మైదానం లోపల ఉంది, వారి పని బయట ఉంది. నేను దానిని ఆ కోణంలోనే చూస్తాను అని తెలిపారు.

ఇంగ్లాండ్‌లో ఆడటం నాకు చాలా ఇష్టం. అందులో ఎలాంటి సందేహం లేదు. అక్కడి వాతావరణం, మైదానం, పిచ్‌లు… ఏ ఫార్మాట్ ఆడినా మిమ్మల్ని విభిన్న మార్గాల్లో సవాలు చేస్తాయి. ఒక క్రికెటర్‌గా మనకు కావాల్సింది కూడా అదే. మైదానంలో గడిపిన సమయాన్ని ఆస్వాదించాను, కానీ ఫలితం మాత్రం కాస్త నిరాశపరిచింది అని తెలిపారు రోహిత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -