ఏపీలో అధికార,విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్తాయికి చేరింది.ప్రజాప్రతినిధులు అనేది మరచి ఇస్టమొచ్చిన రీతిలో అసభ్యకరంగా మాటల తూటాలు పేలుతున్నాయి.తాజాగా వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్ రోజాపై అధికార పార్టీ మంత్రి ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అవడాన్ని ఫిరాయింపు మంత్రి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. తాగుబోతులంతా కేబినెట్లో కూర్చుని మద్యం పాలసీ తయారు చేశారని రోజా విమర్శించడంపై స్పందించిన అమర్నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు రోజా మందు తాగడం మానేయాలని సూచించారు. అలా చేసి అప్పుడు మాట్లాడితే బాగుంటుందన్నారు.
మొన్నటి ఎన్నికల్లో జగన్లో అతి విశ్వాసం కనిపించిందని… ఇప్పుడు ఓటమి భయం కనిపిస్తోందన్నారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. రుణమాఫీ సాధ్యం కాదని చెప్పిన జగన్ ఇప్పుడు వాగ్దానాలు ఇవ్వడాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.