ఓ జాతీయ పార్టీ దక్షణాది రాష్ట్రాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడల్లాంటివి అమలు చేస్తోందని హీరో శివాజీ చేసన వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందించారు. కేవలం అలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతాయని…రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేసి పొలిటికల్ ఆపరేషన్ చేస్తాయని అనుకోవడం అవివేకమవుతుందని చెప్పారు.
ప్రతి రాజకీయ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో నెగ్గాలనే ఉంటుందని… అయితే సినిమాల్లో చూపించినట్టుగా రాజకీయ వ్యూహాలు ఉండవని అన్నారు. ఆపరేషన్ గరుడకు రూ. 4800 కోట్లు కేటాయించారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ… ప్రజల ఓటింగ్ ను బట్టే పార్టీలు గెలుస్తాయని… పార్టీల వ్యూహాలతో కాదని అన్నారు.
డబ్బుతోనే గెలుస్తామనుకుంటే… టాటాలు, అంబానీల వద్ద మన బడ్జెట్ అంత డబ్బుందని… నిమిషాల్లో గవర్నమెంటులను మార్చేయగలరని చెప్పారు. శివాజీ కథ చెప్పారని తాను అనడం లేదని… ఆయన కథే చెప్పాలనుకుంటే నిన్నే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరో కల్యాణ్ జీ అనే వ్యక్తి దీన్ని చెబితే, శివాజీ నమ్మి ఉంటారని అభిప్రాయపడ్డారు.