Sunday, May 19, 2024
- Advertisement -

పూరీ జగన్నాథ్ తల్లి నగలు అమ్మేసిన వేళ !

- Advertisement -

కొందరు డైరెక్టర్ లు తమకి నిజజీవితాల్లో ఎదురైనా ఇబ్బందులు, నిజాలూ తెరమీద ఆవిష్కరిస్తారు. అందులో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. తనను నట్టేట ముంచిన వారిగురించి కూడా పూరీ చాలా తేలికగా మాట్లాడేస్తారు అది ఆయన ఫిలసాఫీ లో బాగం. కొన్నేళ్ల కిందట ఓ నమ్మిన మిత్రుడి చేతిలో మోసపోయి పూరి సర్వం కోల్పోయారు అని చెప్పుకుంటూ ఉంటారు.

అప్పట్నుంచి పూరి ఫిలాసఫీనే మారిపోయింది. ఆ ఫిలాసఫీనే తన సినిమాల్లోనూ చూపిస్తుంటాడు.  అప్పటి చేదు రోజుల్లో తనకి ఎవరూ లేని సమయంలో తన తల్లి తోడుగా ఎలా నిలిచింది అనేది చెప్పుకొచ్చారు పూరీ. ” నేను సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వేళ నా కంటే మా అమ్మ ఎక్కువ దృఢంగా నిలబడింది. ఆమె నన్నేమీ మందలించలేదు. తిట్టలేదు.

నా దగ్గరికి వచ్చి ధైర్య వచనాలు పలికింది. నాన్నా.. నువ్వు మళ్లీ అంతా సంపాదించుకోగలవని నాకు తెలుసు బాధ పడకు ధైర్యం కోల్పోకు అని చెప్పింది. తన నగలను కూడా అమ్మేసి లక్షల్లో సొమ్ము తీసుకొచ్చి నా చేతికి ఇచ్చింది, దాని వలనే నేను మళ్ళీ ఇంతవాడిని అయ్యాను ” అని చెప్పుకొచ్చారు పూరీ. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -