Tuesday, May 7, 2024
- Advertisement -

జేసీలకు దిమ్మతిరిగే షాక్….. వైకాపాలోకి ప్రధాన అనుచరుడు

- Advertisement -

చంద్రబాబుతో సహా మొదట్నుంచీ టిడిపిలో ఉన్న ఇతర నాయకులకంటే కూడా రెచ్చిపోయి మరీ జగన్‌పై విమర్శలు చేస్తూ ఉంటారు జేసీలు. జేసీల తిట్లకు ఎప్పుడూ స్పందించని జగన్ ఇప్పుడు అదే జేసీలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. జేసీల ప్రధాన అనుచరుడు, క్యాడర్‌తో ఎప్పుడూ సన్నిహితంగా ఉంటూ భారీగా పలుకుబడి కలిగిన నాయకుడు జగన్ సమక్షంలో వైకాపాలో చేరాడు. ఈ చేరిక జేసీలకు శరాఘాతమేనన్న వ్యాఖ్యలు అనంతపురంలో వినిపిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో కూడా జేసీల గెలుపుకు ప్రధాన కారణం జేసీల ముఖ్య అనుచరుడైన కోగటం విజయభాస్కరరెడ్డి అన్న వార్తలు ఆంధ్రజ్యోతి, ఈనాడుల్లో కూడా వచ్చాయి. కాంగ్రెస్‌లో పార్టీలో కూడా పదవులు చేపట్టిన విజభాస్కరరెడ్డి జేసీల తీరుతో విసిగిపోయి ఇప్పుడు వైకాపాలో చేరాడు. జేసీలకు అనంతపురంలో రాజకీయ పునర్వైభవాన్ని తెచ్చిపెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబాన్ని జేసీ సోదరులు తీవ్రస్థాయిలో విమర్శించడం తనను కలచివేసిందని విజయభాస్కరరెడ్డి చెప్పాడు. నమ్మిన నాయకులను చేరదీయడంలో, నమ్మినవాళ్ళకు మంచి చేయడంలో వైఎస్‌ల తర్వాతే ఎవ్వరైనా అని విజయభాస్కరరెడ్డి మీడియాతో చెప్పాడు. 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో అత్యధిక సీట్లు వైకాపానే గెలుచుకుంటుందని……జేసీల చర్యలతో సామాన్య ప్రజలు కూడా వాళ్ళకు పూర్తిగా దూరమైన పరిస్థితులు ప్రస్తుతం అనంతపురంలో ఉన్నాయన్న విశ్లేషణలను విజయభాస్కరరెడ్డి సమర్థించాడు. దశాబ్ధాలుగా జేసీలకు వెన్నంటి ఉండి……జేసీల అనుపానులన్నీ తెలిసిన నాయకుడు…..జేసీల గెలుపుకు ప్రధాన కారణమవుతున్న నాయకుడు ఇప్పుడు వైకాపాలో చేరడంతో జేసీలతో పాటు టిడిపికి కూడా అనంతపురం జిల్లాలో గడ్డుకాలం మొదలైనట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -