Friday, May 10, 2024
- Advertisement -

బీజేపీపై ఫైర్ అయిన‌ హాస్య నటుడు!

- Advertisement -

హాస్య నటుడు కిషోర్ దాస్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీకి నూకలు చెల్లిపోతాయంటూ బీజేపీపై ఫైర్ అయ్యాడు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్న ఆ పార్టీకి ప్రజలు గడ్డి పెడతారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు తక్కువగా రావడానికి కారణం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమేనని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వారికి గడ్డుకాలం ఎదురుకానుందని కిషోర్ దాస్ జోస్యం చెప్పారు. కోస్తా బిడ్డగా తాను తన ఆవేదనను తెలియజేస్తున్నానని చెప్పారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా ప్రత్యేక హోదా గురించి ఆలోచిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -