- Advertisement -
టాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు సంపాందించిన గోపిచంద్ గత కొంతకాలంగా హిట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.లౌక్యం సినిమా తరువాత మనోడికి ఇప్పటి వరకు హిట్ లేదు.దీంతో ఎలాగైనా సరే హిట్ కొట్టలనే కసితో గోపిచంద్ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ సొంతం చేసుకుంది పంతం.
యాక్షన్ అండ్ మెసెజ్ ఓరియెంటెడ్గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్ను, 3 కోట్ల గ్రాస్ను రాబట్టిందని సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్ నటించింది.కె చక్రవర్తి అనే నుతన దర్శకుడు దర్శకత్వం వహించారు.
