బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్పై ఓ మహిళ కేసు పెట్టింది. రణబీర్ కపూర్ పై పూణే సివిల్ కోర్టులో ఆ మహిళ దావా వేసింది. ఈ మేరకు కోర్టు అతడికి మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ముంబై నగరంలోని ట్రంప్ టవర్లో రణబీర్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్నాడు.సూర్య వంశీ అనే మహిళ కూడా అదే అపార్ట్మెంట్లో ఉంటుంది.నెలకు 4 లక్షల రెంట్ గల ఈ అపార్ట్మెంట్ లో ఆమె 11 నెలల పాటు ఉన్నారు. ఆ తరువాత రణబీర్ వాళ్లను ఖాళీ చేయమని చెప్పడంతో అక్కడ నుండి వెళ్లిపోయారు.
కానీ అనూహ్యంగా రణబీర్ పై ఆమె దావా వేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెంటల్ అగ్రిమెంట్ నియమాలకు విరుద్ధంగా రణబీర్ తమను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇల్లు ఖాళీ చేయమని రణబీర్ బలవంతం చేశారని ఆమె అన్నారు.ఈ కోర్టులోనే విషయం తేల్చుకుంటానని రణబీర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక చాలా కాలం తరువాత సంజు సినిమాతో హిట్ కొట్టాడు రణబీర్ కపూర్.