జలవిలయానికి అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకోవడానికి సామాన్యులు, పలువురు ప్రముఖులతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా ముందుచ్చి భారీగా విరాలాలు ఇచ్చారు. బాలీవుడ్ భామ అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ దంపతులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు ఆహార, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
అయితే రెండు మూడు రోజులక్రితం సన్నీలియోన్ కేరళ వరదబాధితులకు రూ.5 కోట్లు సహాం చేసిందనే వార్తలు సోషియల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఐదు కోట్లు విరాలం ఇచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయారు.అయితే అది వాస్తవం కాదని తేలింది. నిజంగా సన్నీలియోన్ చేసిన సహాయం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎంత సహాయం చేసింది సన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది
భర్త డేనియల్ వెబర్తో పాటు మరికొందరు సభ్యులతో కలిసి సన్నీ లియోన్.. కేరళ బాధితులకు సహాయం అందిస్తోంది. వరద బాధితులకు 1200 కిలోల బియ్యంతో పాటు పప్పు ధాన్యాలు అందించారు. మరింత సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సన్నీ తెలిపింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సన్నీ పోస్టు చేసింది. భర్త డానియెల్ వెబర్, మరికొంత మంది బాలివుడ్ స్నేహితుల సాయంతో 1200 కేజీల రైస్, పప్పును పంపించింది.
https://www.instagram.com/p/Bm1JPhJnSVh/?taken-by=sunnyleone
