బిగ్బాస్ రెండో సీజన్లో మొదట్లో హౌస్మెట్స్ అందరిలో కన్నా చాలా తెలివిగా, మంచి దానిలా కనిపించిన గీతా మాధురి ఇప్పడు సగటు ప్రేక్షకుడికి నచ్చడం లేదు. షో మొదట్లో తన ప్రవర్తనతో అందరిని ఆకట్టుకున్న గీతా ,ఇప్పడు అదే ప్రవర్తనతో అందరి చేత ఛీ ఛీ అనిపించకుంటుంది. సామ్రాట్తో ఆమె వ్యవహిరించిన తీరుతో ఆమెపై వ్యతిరేకత మొదలైంది. సామ్రాట్ దగ్గరికి వెళ్లడం అతనని కౌగిలించుకోవడం,ముద్దులు పెట్టడం వంటివి చేసింది గీతా. సామ్రాట్తో గీతా వ్యవహరం ముదురుతుందని గ్రహించిన తోటి ఇంటి సభ్యులైన దీప్తి,శ్యామలలు గీతా చెప్పే ప్రయత్నం చేయగా వారిని లైట్ తీసుకుంది గీతా మాధురి. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో అసలు అక్కడ టాస్క్ లేదు,గేమ్ లేదు సామ్రాట్ వచ్చి గీతాను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. దీంతో షో చూస్తున్న వారంతా షాక్ గురైయ్యారు. శనివారం జరిగిన ఎపిసోడ్లో నాని కూడా నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందనే చెప్పే ప్రయత్నం చేయగా,కౌశల్తో గొడవ గురించి చెప్పుకొచ్చింది గీతా. ఇక రాఖీ సందర్భంగా నాని మొదటిసారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి రాఖీలను కట్టించుకున్నాడు.
ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో సామ్రాట్కు రాఖీ ఎవరు కడతారు అని అడిగినప్పుడు గీతా తప్ప మిగిలిన హౌస్మెట్స్ అందరు లేచి సామ్రాట్కు రాఖీ కట్టారు. తన మనస్సులో ఏం లేనప్పుడు గీతా కూడా వెళ్లి రాఖీ కట్టవచ్చు కదా అని సగటు అభిమాని గీతాను ప్రశ్నిస్తున్నారు. దీంతో గీతాకు బయట బాగా వ్యతిరేకత వచ్చిందని గ్రహించిన గీతా ఇంటి సభ్యులు,గీతా కోసం స్పెషల్గా ఓ రాఖీని నానికి ఇచ్చి పంపించారు. ఆ రాఖీని సామ్రాట్ చేత కట్టించుకోమని కోరారు. దీంతో షాక్ అయిన గీతా కాసేపు ఏం మట్లాడకుండా కుర్చొంది.తరువాత నాని ఎవరు మిగిలారు అంటు నాని అడగగా అందరు గీతా సామ్రాట్ల పేర్లు చెప్పడంలో ఏదో బలవతంగా వెళ్లి సామ్రాట్కు రాఖీ కట్టిందని చూస్తున్న ప్రేక్షకులకు ఇట్టే అర్థం అవుతుంది. మళ్లీ బయట చూసే ప్రేక్షకులపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది గీతా. ఇక కౌశల్తో ఆమె ప్రవర్తించిన తీరు కూడా ఏం బాలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తనికి షో మొదట్లో మంచి పేరు తెచ్చుకున్న గీతా చివర్లో ఇలా మారిపోయింది ఏంటా అని చాలా మంది చర్చించుకుంటున్నారు.