జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాటు రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో 34 మంది మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం బస్సుడ్రైవర్ తప్పిదం వల్లే చోటు చేసుకుందని వేముల వాడ ఆర్టీసీ డీపో మేనేజర్ అభిప్రాయపడుతున్నారు.
కొండగట్టుకు బస్సు చేరుకోకముందే రెండు స్టేజీల వద్ద సుమారు సుమారు 50 మందికి పైగా బస్సులో ఎక్కారు. అయితే కండక్టర్ టిక్కెట్లు ఇస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.శనివారపేట నుండి బస్సు బయలుదేరిన కొద్దిసమయంలోనే ఈ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో ఆప్రాంతం అంతా బాధితుల రోదనలు హాహాకారాలతో నిండిపోయింది.
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిజానికి ఈ బస్సు ఫిట్నెస్తో ఉందా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ బస్సు డ్రైవర్ ఘాట్ రోడ్డు నుండి కిందకు దిగుతుండగా ఘాట్ రోడ్డుకు ఉన్న రెయిలింగ్ను ఢీకొట్టి లోయలోకి నాలుగు పల్టీలు కొడుతూ పడిపోయింది. ఘాట్ రోడ్డుపై సైన్ బోర్డులు ఉన్నప్పటికి ఈ ప్రమాదం జరిగడం బాధకరం అని అధికారులు పేర్కొన్నారు.
