Saturday, May 18, 2024
- Advertisement -

181 పరుగుల‌కే వెస్టిండిస్ పెక‌ప్‌

- Advertisement -

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్‌లో టీంఇండియా ప‌ట్టు బిగించింది.మూడో రోజు ఆటలో భాగంగా 94/6 ఓవర్‌నైట్‌ స‍్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్‌.. మరో 87 పరుగులు జోడించి 181 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు రోస్టర్‌ ఛేజ్‌(53) హాఫ్‌ సెంచరీతో మెరవగా, కీమో పాల్‌(47) సైతం ఆకట్టుకున్నాడు.ఈ జోడి ఏడో వికెట్‌కు 73 పరుగులు జోడించిన తర్వాత పాల్‌ ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి ఛేజ్‌ కూడా పెవిలియన్ చేరాడు.

టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ నాలుగు వికెట్లు సాధించగా, షమీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు. అంతకముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 649/9 వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇండియా 468 పరుగుల ఆధిక‍్యంలో నిలిచింది.ఫాలోఆన్‌లో ప‌డ్డ వెస్టిండీస్ వెంట‌నే రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -