రాజశేఖర్ రెడ్డి కుటుంబానికీ , రాజశేఖర్ రెడ్డి కీ ఆయనకంటే ఆయన కొడుకు – ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి దగ్గర మనుషులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో పేర్నినాని ఒకరు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మచిలీపట్నం లోనే కాకుండా కృష్ణా జిల్లాలో కూడా వైకాపా తరఫున నిలబడ్డారు. నియేజకవర్గం లో మున్సిపల్ కార్మికులపై పోలీసుల ఉక్కుపాదం మోపిన తరుణం లో మాస్ జనాలతో , కార్మికులతో ఆయన నిలిచిన తీరు ఇప్పటికీ ఆ ప్రాంతం లో గొప్పగా చెప్పుకుంటారు.
గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు తరవాత అనేకమంది వైకాపా లోంచి జంప్ చేసినా జగన్ కి అత్యంత నమ్మకస్తుడుగా ఉండే నాని ఇప్పటికీ జగన్ కి నమ్మిన వ్యక్తిగా వైకాపా లోనే ఉండడం కాకుండా కృష్ణా జిల్లా లో వైకాపా గెలుపుకోసం ప్రణాలికలు రచిస్తూ ఉండడం విశేషం.
వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఉన్న పదిహేను స్థానాల్లో కనీసం తొమ్మిది స్థానాలు గెలిచి జగన్కు బహుమతిగా ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. పక్కా వ్యూహాలతో, జగన్ సమీకరణలతో, అన్ని వర్గాలు – కులాలు – మతాల వారిని దగ్గర చేసుకుంటూ ఒక అద్భుత మాస్ లీడర్ గా ఎదిగారు ఆయన. ‘రావాలి జగన్–కావాలి జగన్’అనే నినాదం కృష్ణా జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేస్తోన్న నాని అతని అనుచర గణం వెల్లడిస్తున్నారు.