ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మహా ఘట్టం ఆవిసృత మైంది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బీజేపీయేతర పార్టీలతో కూటమి కోసం బాబు కాంగ్రెస్తో బాబు కలసిపోయారు.నాలుగు సంవత్సరాలు భాజాపాతో సంసారం చేసిన టీడీపీ విడాకులు తీసుకొని కాంగ్రెస్ పార్టీతో తాలి కట్టించుకుంది. కొద్ది నెలల క్రితం టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ఆ పార్టీ నేతలు వీరలెవెల్లో రెచ్చిపోయారు.
2019 ఎన్నికల్లో టీడీపీ ప్రజలు ఘోరీ కడతారాని ఇప్పటికే అనేక సర్వేలు స్పష్టంచేశాయి. పాదాయాత్రలో జగన్కు వస్తున్న స్పందన చెప్పనక్కర్లేదు. ఇక కత్తితో దాడి ఘటన తర్వాత ఆ రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జగన్పై దాడి ఘటన తర్వాత హుటాహుటిన ఢిల్లీ వెల్లి రాహుల్ను కలిశారు. కాంగ్రెష్ ,టీడీపీ పొత్తుపై మంత్రులు, ఇతర టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
డిప్యూటీ సీఎం కేయీ ఒక డుగు ముందుకేసి ఆలా జరిగితే ఉరివేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవంకోసం పుట్టిన టీడీపీ కాంగ్రెస్తో కలవదని ఘంటా పథంగా చెప్పారు. ఇక మరో మంత్రి అయ్యన్న పాత్రడు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలు ఊడదీసి కొడతారని వ్యాఖ్యానించారు. అందరూ అనుకున్న ట్లుగా నే తల్లి కాంగ్రెస్, పిల్ల టీడీపీ కలసి పోయారు. మరి ఇప్పుడు కేయీ కృష్ణమూర్తి తన మాటకు కట్టుబడి ఉంటారా అనేది చూడాలి.