మాస్ రాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.”ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోనివాళ్లు కొందరైతే, శక్తిమేరకు నయవంచన చేసేవాళ్లు కోకొల్లలు” అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. గతంలో రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమా హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ను చూసినవారందరు ఇది ఎక్కడో చూసినట్లుందే అని ఫిల్ కలగుతుందని వ్యాఖ్యనిస్తున్నారు.
అయితే ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ ఈ ట్రైలర్ కి 4 మిలియన్ల వ్యూస్ లభించినట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రవితేజ ఈ సినిమాలో మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నారు.గోవా బ్యూటీ ఇలియానా చాలా కాలం తరువాత తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.అమర్ అక్బర్ ఆంటోని సినిమాను ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.