టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గత కొంతకాలం సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్నాడు.శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోదన మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ అయిన ఆపరేషన్ 2019 గత శనివారం విడుదలైంది.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పవన్ కల్యాణ్ని టార్గెట్ చేసుకున్నట్లు రివ్యూలలో వార్తలు వచ్చాయి.సినిమాలో పవన్ని ఉద్దేశించి కొన్ని సీన్లతో పాటు,కొన్ని డైలాగ్స్ కూడా సెటైరికల్గా ఉన్నాయాని రివ్యూలలో రాశారు.సినిమాలో పవన్ను టార్గెట్ చేశారనే వార్తలపై చిత్ర యూనిట్ స్పందించింది.పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు సన్నివేశాలు ఉన్నాయనే కామెంట్స్కు చిత్ర దర్శకుడు కరణం బాబ్జీ క్లారిటీ ఇచ్చారు.
ఎవరిని ఉద్దేశించి సినిమాలో కామెంట్స్ చేయలేదని అలాగే మా సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తిట్టలేదని దర్శకుడిగా కాకుండా బాధ్యత గల పౌరుడిగా భావించి సినిమాను తెరకెక్కించినట్లు చెప్పారు. ఇక హీరో శ్రీకాంగ్ మాట్లాడుతు..పవన్ అంటే మాకు చాలా గౌరవం అని ,అలాంటి వ్యక్తిని మేం ఎందుకు టార్గెట్ చేస్తామని ఆయన ప్రశ్నించారు.ఈ సినిమా పొలిటీకల్ మీద కాబట్టి ఎవరికి వారు ఊహించుకుంటు నాయకులకు అంటగడుతున్నారని వాపోయారు శ్రీకాంత్.రివ్యూలు నిజంగా బాధను కలిగించాయని ,సినిమాకు మంచి టాక్ వస్తోంది తెలిపారు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత కూడా ఆనందంగా ఉన్నారని అయితే రివ్యూలు రాసేవాళ్ళు కూడా కాస్త అలోచించి రాయాలని శ్రీకాంత్ కోరారు.