ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,అక్కినేని నాగేశ్వరరావు మనమడు హీరో సుమంత్ క్లాస్మెట్స్ అన్న సంగతి తెలిసిందే.ఇద్దరు కలిసి కొంతకాలం చదువుకున్నారు.వీరిద్దరు కలిసి ఇంటర్ వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు.హీరో సుమంత్ గతంలో జగన్కు తనకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలాసార్లు మీడియ సాక్షిగా చెప్పారు.తాజాగా సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యపురం ఇటీవలే విడుదలై మంచి విజాయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న సుమంత్ మరోసారి జగన్కు తనకున్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు.’జగన్, నేను రెస్టారెంట్కి వెళ్లి కొంచెం లేటుగా ఇంటికి వచ్చాం. తనను మా ఇంట్లోనే పడుకోమని చెప్పాను.
లేటుగా వెళితే వాళ్లింట్లో ప్రాబ్లమ్ అని మా ఇంటికి వచ్చాం. నా ఇంటి తాళాలు మరచిపోయాను. నా బెడ్రూమ్ తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) బెడ్రూమ్ పైన ఉండేది. దీంతో ఒక రెయిలింగ్ ద్వారా నా బెడ్రూమ్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. కింద ఉన్న జగన్ నేను పైకి ఎక్కించేందుకు సాయం చేస్తున్నాడు. ఇంతలో సౌండ్ వినిపించి తాతగారు బయటకు వచ్చారు. దీంతో తాతగారికి దొరికిపోయాము.అక్కడిక్కడే జగన్ ఎవరో చెప్పాను.దీంతో తాతగారు జగన్ను ఏం అనలేదు.ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనని ఆనాటి జ్క్షాపకాలను గుర్తు చేసుకున్నారు సుమంత్.ప్రస్తుతం జగన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారని ,కలిసి చాలాకాలం అయిందని ,తను ప్రీగా ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తానని తెలిపారు సుమంత్
- Advertisement -
బెడ్రూమ్లో అడ్డంగా బుక్కైన వైఎస్.జగన్,సుమంత్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -