రేణు దేశాయ్ పవన్ కల్యాణ్తో కొంతకాలం సహజీవనం చేసి మరి అతనిని పెళ్లి చేసుకుంది.12 ఏళ్ల వీరి కాపురానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఏమైందో ఏమో తెలియదు కాని సడన్గా వీరిద్దరు విడిపోయారు.పవన్ నుంచి విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ పుణేలో సెటిల్ అయింది.పిల్లలు కూడా రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు.అప్పట్లో తను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి పెద్ద సంచలనమే సృష్టించింది.రేణు దేశాయ్ రెండో పెళ్లిపై పవన్ అభిమానులు ఓ రేంజ్లో రెచ్చిపోయారు.రేణు కూడా వారికి ఏ మాత్రం తగ్గలేదు.తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్.
‘డిసంబర్ నెలలో కోయంబత్తూర్ లో ఇషా సెంటర్ కు సంబంధించిన లింగ భైరవీ ఆలయంలో చాలా సింపుల్ గా మా పెళ్లి జరగబోతుంది. మా పెళ్లి తరువాత కోయంబత్తూర్ లోనే ఓ అనాధాశ్రమంలో అన్నదానం చేస్తాం. గతంలో పవన్ ను పెళ్లి చేసుకున్నప్పుడు గ్రాండ్ మెహందీ ఫంక్షన్ చేయాలనుకున్నాం. కానీ దానికి పవన్ అంగీకరించలేదు. ఈ పెళ్లి ద్వారా నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోబోతున్నాను”అంటూ చెప్పుకొచ్చింది. తన రెండో పెళ్లిని తన పిల్లలు ఇద్దరు అంగీకరించారని చెప్పుకొచ్చింది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
