పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13వేల కోట్ల ఎగ్గొట్టి లండన్లో దర్జాగా జీవిస్తున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీని లండన్ పోటీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలతో వారు నీరవ్ను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో నీరవ్ మోదీని తమకు అప్పగించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ బ్రిటన్ను కోరిన సంగతి తెలిసిందే. కాసేపట్లో లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో యూకే పోలీసులు ఆయనను ప్రవేశ పెట్టనున్నారని సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.నీరవ్ మోదీని భారత్ కు అప్పగిస్తారా, లేదా అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. భారత్ కు అప్పజెప్పాలంటే అక్కడి కోర్టులో సుదీర్ఘమైన కార్యాచరణ ఉంటుంది. ఇప్పటి వరకు మాల్యాను అక్కడి ప్రభుత్వం భారత్కు అప్పగించలేదు.
- Advertisement -
ఆర్థిక నేరగాడు మోదీ అరెస్ట్..
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -