Sunday, May 19, 2024
- Advertisement -

కోటి రూపాయలు ఇచ్చిన రజినీకాంత్ :

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయ్. ఆయన అమెరికా లో ఉన్నారు అనీ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఆయన్ని అక్కడికి తీసుకుని వెళ్ళారు అనీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అనీ వార్తలు వచ్చాయి. ఆయన అభిమానులు రజినీకాంత్ తమ్ముడు వల్లనే ఇదంతా జరిగింది అటూ గొడవ గొడవ కూడా చేసారు.

అసలే ఆ విషయం లో పరిస్థితులు కంగారుగా ఉంటే మళ్ళీ ఇప్పుడు కొత్త న్యూస్ లో వచ్చారు రజినీకాంత్. తాజాగా రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ ఒక ప్రకటన చేసారు. దీని ప్రకారం 2002 లో కావేరీ నది అనుసంధానం కోసం కోటి రూపాయలు ఇస్తాను అని ప్రకటించిన రజినీకాంత్ అప్పటి నుంచీ ఇవ్వలేదు ఇన్నాళ్ళ తర్వాత ఆ నగదు సమబందింత బ్యాంకు ఖాతాలో వేసారు అని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

నదుల అనుసంధానానికి పలువురు ముఖ్యమంత్రులు ఇచ్చిన పిలుపు మేరకు రజనీ స్పందించినట్లుగా పేర్కొన్నారు. రజనీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఆయన.. తంజావూరు లోని బృహదీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించటం గమనార్హం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -