జూనియర్ ఎన్టీఆర్కు అభిమానగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అభిమానులు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అభిమాన దేవుళ్లు లేకపోతే తాను లేనని అంటుంటా రు. ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. సినీ హీరోలు తమ అభిమానుల కోసం.. అభిమానులు తమ హీరోల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. మొదటి అడుగు వేసినప్పటి నుంచి ఉన్న అభిమానులపై హీరోలు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతారు. ఇలా తన ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ తనతో ప్రయాణం చేసిన ఓ అభిమాని మృతి పట్ల జూ.ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు
మీకోసం మీ వాళ్లు ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు దయచేసి సురక్షితంగా తిరిగి వెళ్లండి అంటూ సూచిస్తారు. అంతలా అభిమానులపై ప్రేమను పెంచుకునే ఎన్టీఆర్ నేడు ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు జయదేవ్ చనిపోయారన్న వార్త విని ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.ఈ మేరకు జయదేవ్ను గుర్తుచేసుకుంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు.
నటుడిగా తాను ఎదుర్కొన్న ఎత్తుపల్లాల్లో తన వెంటన ఉన్నది తన అభిమానులేనని చెప్పాడు. తనకు తోడున్న వారిలో జయదేవ్ చాలా ముఖ్యమైనవారని తెలిపాడు. జయదేవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. జయదేవ్తో దిగిన ఫొటోను సైతం పోస్ట్ చేశారు.