Thursday, May 2, 2024
- Advertisement -

కంచుకోటలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ… ఇద్ద‌రు న‌క్స‌ల్స్ మృతి

- Advertisement -

ఛత్తీస్ గఢ్ లోని మావోల కంచుకోటగా పేరుగాంచిన దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో వారికి భారీ బిగ్ షాక్ త‌గిలింది. ఈ ప్రాంతంలో జ‌రిగిన భీక‌ర ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు న‌క్స‌ల్స్ మృతి చెందారు. దంతేవాడ-సుక్మా అటవీప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయి.

అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బలగాలు కూంబింగ్ ముమ్మరంగా చేస్తున్న స‌మ‌యంలో బలగాల కదలికలను పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలోఇద్దరు మావోయిస్టులు దుర్మరణం చెందినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

ఘటనాస్థలి నుంచి ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తో పాటు 12 బోర్‌ ఆయుధాన్ని, మందుగుండు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ మహిళా కమాండోస్‌ పాలు పంచుకున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -