విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. భారీగా బుల్లెట్ శబ్దాలు.. బీకర అరుపులు.. కాల్పుల మోతతో మన్యంలో ప్రజలు ఉలిక్కి పడ్డారు. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య తీగలమెట్ట పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మంప పీఎస్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఎంత మంది గాయపడ్డారో తెలియాల్సి ఉందని కొయ్యూరు సీఐ వెంకటరమణ తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో మావోయిస్టు కీలకనేత కూడా ఉన్నట్లు సమాచారం.
ఇంకా మావోయిస్టులు ఉన్నారనే దానిపై పోలీసులు కూంబింగ్ విసృతం చేపట్టారు. సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేపట్టారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, కార్బన్, తపంచాను స్వాధీనం చేసుకున్నారు.
లోకేష్ బాబు ముద్ద పప్పు.. అందరూ ఆయనలా కావాలా? : ఎమ్మెల్యే రోజా ఫైర్