- Advertisement -
ప్రపంచకప్లో భాగంగా నేడు ఎడ్జ్బాస్టన్లో న్యూజిలాండ్, పాక్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దం అయ్యింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. నేడు జరిగే మ్యాచ్ పాకిస్తాన్కు కీలకంగా మారింది. న్యూజీలాండ్పై గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే. ఇక వరుజ విజయాలతో దూసుకెళ్తున్న కివీస్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి సెమీస్లో అడుగుపెట్టాలని ఆశిస్తోంది.
సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో కివీస్ మ్యాచ్ గెలవాల్సిందే. ఒకవేళ వర్షం పది రద్దయినా సెమీస్ ఆశలు గల్లంతే.