- Advertisement -
వన్డే ప్రపంచకప్ లీగ్ దశలో వచ్చే ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ పోరుకు టీమిండియా కొత్త ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనుంది. రెండు జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో మ్యాచ్ వీక్షించేటప్పుడు అభిమానులు, అంపైర్లు, మైదానంలోని ఆటగాళ్లు కూడా గందరగోళానికి గురయ్యే ఛాన్స్ ఉంది. హోమ్.. అవే విధానంలో ఆతిథ్య జట్టు ధరించే జెర్సీలో ఎలాంటి మార్పు ఉండదు. పర్యాటక జట్టు రెగ్యులర్గా వాడే జెర్సీ స్థానంలో తమకు ఇష్టమైన వేరే రంగు జెర్సీని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా టీమిండియా అఫీషియల్ అపరెల్ స్పాన్సర్ నైకీ.. ఈ రోజు జెర్సీని అధికారికంగా ఆవిష్కరించింది. బ్లూ, ఆరెంజ్ రంగుల కలయికతో ఈ జెర్సీని రూపొందించారు.