Saturday, May 4, 2024
- Advertisement -

రెండు కార్లు ఢీ….ముగ్గురు దుర్మరణం , ఇద్దరి పరిస్థితి విషమం

- Advertisement -

శామీర్‌పేట ఎమ్మార్వో కార్యాలయం ముందు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చుసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి విషయమంగా ఉంది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టిన కారు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అతి వేగమే ప్రమాదానికి కారణం అని అక్కడున్న స్థానికులు తెలిపారు. ప్రమాద తీవ్రతతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -