Friday, May 3, 2024
- Advertisement -

తూర్పుగోదావరి జిల్లాలో గ్యాంగ్ రేప్…!

- Advertisement -

దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించింది. డాక్టర్ దిశను కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశం మొత్తం అంటుంది. మహిళలకు రక్షణ కల్పిస్తామని.. కఠనమైన నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నప్పటికి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా 50 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. భర్త, కుమారుడు మరణించగా.. కుమార్తె హైదరబాద్ లో ఉంటున్న క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు నిందితుల్లో ఒకర్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఏపీ లో జరిగిన 50 ఏళ్ల మహిళ సామూహిక అత్యాచారం, హత్య ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా.. నిందితులకు మరణ దండన విధించినా.. ఈ దారుణాలు తగ్గడం లేదు. అందుకు ఉదాహరణ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న అత్యాచారం, హత్య ఘటన. ఇలాంటి ఘటనలు పదే పదే కావడం వల్ల ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -