విలక్షణ నటుడు ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడవుతున్నాడు. హీరోగానే కాక వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది. గుండెల్లో గోదారి చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై…‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’, ‘గుడ్లక్ సఖి’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీని త్వరలో పెళ్లాడబోతున్నాడు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి నిశ్చితార్థం మార్చి 24న ఘనంగా జరిగింది. బంధువులు, కొద్దిమంది సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. తన నిశ్చితార్థాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆది పినిశెట్టి ఓ పోస్ట్ పెట్టాడు. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అందుకు మీరందరూ ఆశీస్సులు, దీవెనలు అందించాలి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు ఆది పినిశెట్టి.
యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో నిక్కీ గల్రానీ , ఆది పినిశెట్టి కలిసి నటించారు. తెలుగులో మలుపు పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.