Sunday, April 28, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లంలో దాయాది ఆది

- Advertisement -
  • రామ్‌చ‌ర‌ణ్‌, ఆది అన్న‌ద‌మ్ముల్లా

హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ప్ర‌త్యేక పాత్ర‌ల్లో ఆది పినిశెట్టి క‌నిపిస్తున్నాడు. హీరోగా ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ప్ర‌త్యేక పాత్ర‌ల‌తో విశేష గుర్తింపు పొందుతున్నాడు. అయితే రంగ‌స్థ‌లం 1986 సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు దాయాదిగా క‌నిపిస్తున్నాడ‌ట‌. స‌రైనోడు సినిమాలో విల‌నిజంలో మ‌రో కోణాన్ని ఆది చూపించాడు. ఆది స్నానం చేసి వ‌చ్చిన త‌ర్వాత‌ ఓ మంత్రికి ట‌వ‌ల్ విప్పి చూపించ‌డం.. ఆ వెంట‌నే త‌న క్రూర‌త్వం ఎలా ఉంటుందో త‌న న‌ట‌న‌తో చెప్పాడు. ఆ తర్వాత నిన్ను కోరి సినిమాలో ప్ర‌త్యేక పాత్ర‌లో మెరిశాడు.

ఇక ఇప్పుడు మరోసారి మెగా హీరోతో పోట్లాడడానికి సిద్ధ‌మయ్యాడు. ప్రస్తుతం రామ్‌రణ్ రంగస్థలం 1985 సినిమాలో ఆది కూడా నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆది – రామ్‌చరణ్ ఇద్దరు సినిమాలో అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారట. కథలో ఆది, రామ్ చరణ్ పాత్రని డామినేట్ చేసేలా ఈర్ష్య‌తో ఉంటుందని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వ‌స్తోంది. ఆ పాత కాలం నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌నుంది. అందుకే మేకింగ్‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. ఇద్దరి మధ్యన ఒక ఫైట్ సిన్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంద‌ని టాక్‌. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న స‌మంత న‌టించ‌నుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -