Saturday, May 4, 2024
- Advertisement -

యాత్ర డేట్‌ను షురు చేసిన మంచు విష్ణు

- Advertisement -

‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా షూటింగ్ పూర్తి అయిన దాదాపు 4 నెల‌లు కావ‌స్తుంది.జ‌న‌వ‌రిలో విడుద‌ల కావ‌ల్సిన సినిమా ఇప్పుడు వ‌రకు అనేక డేట్లు చెప్పి వాయిదా ప‌డుతు వ‌స్తుంది.ఇంకా జ‌నాలు కూడా ఈ సినిమా గురించి మ‌రిచిపొయారు.ఇప్పుడు మ‌ళ్లీ ఈ చిత్రం మ‌రో డేట్‌ని ఫిక్స్ చేశారు. ఈ నెల 27న థియేటర్లలో నవ్వుల యాత్ర మొదలు కానుంది. ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత మంచు విష్ణు, జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక.

విష్ణు–నాగేశ్వర రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎంత వినోదం పంచాయో ‘ఆచారి అమెరికా యాత్ర’ అంతకు మంచి థియేటర్లలో నవ్వులు పంచుతుంది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్‌ హిట్‌ సాధిస్తారనే నమ్మకం ఉంది. బ్రహ్మానందం– విష్ణుల కాంబినేషన్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -