హిందీలో సూపర్హిట్ అయిన సినిమా ‘2 స్టేట్స్’. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకట్ కుంచం దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాహుబలి నటుడు అడవి శేష్, సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో రాజశేఖర్ తన కూతురిని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎంఎల్వీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను అధికారికంగా శనివారం ప్రారంభించారు.
హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో శనివారం ఉదయం సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, కృష్ణంరాజు, ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్, జీవిత, రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. రాజమౌళి క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ తల్లిగా అలనాటి నటి భాగ్యశ్రీ నటిస్తోంది.