Monday, April 29, 2024
- Advertisement -

“ఎవరు” నుంచి ఎన్నెన్నో!!

- Advertisement -

‘గూడచారి’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న యువ హీరో అడవి శేష్ ఇప్పుడు మరొక ‘ఎవరు’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకట్ రామ్ జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో అడివి శేష్ విక్రమ్ వాసుదేవ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా సినిమా నుండి ‘ఎన్నెన్నో’ అనే మొదటి పాటని విడుదల చేసారు దర్శక నిర్మాతలు. చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాటకి తన వాయిస్ చాలా బాగా సెట్ అయింది. రమేష్ వి ఎన్ వి కూడా సినిమాకి మంచి లిరిక్స్ అందించారు. పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమాకి గూడచారి సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో కూడా అడివి శేష్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -